YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 6 October 2012

'జగన్ కొక న్యాయం-వాద్రాకొక న్యాయమా?'

శ్రీకాకుళం: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యుపిఎ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాపై న్యాయవిచారణకు ఆదేశించాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను టిడిపి నేత ఎర్రంనాయుడు కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు. అవినీతి ఆరోపణల విచారణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి ఒక న్యాయం, రాబర్ట్ వాద్రాకు ఒక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయస్థానంలో కేసు వేస్తామని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!