యూపీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా గురువారం తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని శ్రేణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. డీజిల్ ధరను ఎన్నడూ లేని విధంగా పెంచడం, గ్యాస్ సిలిండర్లపై పరిమితి విధించడంతో పాటు చిల్లర వర్తక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరవడాన్ని పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ప్రజా వ్యతిరేక చర్యలను తక్షణం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవడానికి బంద్ను నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment