తెలంగాణాలో ఉన్న అన్ని సమస్యలకు ఏకైక మార్గం, ఏకైక పరిష్కారం తెలంగాణా రాష్ట్ర సాధనే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడి తెలంగాణాపై తీర్మానం చేయకుండా అడ్డుపడుతున్నాయని ఆయన సోమవారమిక్కడ విమర్శించారు. తీర్మానం ఎప్పుడో చెప్పండంటే స్పీకర్ నుంచి స్పందన లేదని, వచ్చే నాలుగు రోజుల్లో కూడా తెలంగాణాపై తీర్మానం కోసం పోరాడతామని జూపల్లి కృష్ణారావు తెలిపారు.
Monday 17 September 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment