YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 16 September 2012

ముక్కు నేలకు రాయి

తెస్తానన్న తెలంగాణ ఏమైంది?
ఢిల్లీలో జిత్తులమారి వేషాలెందుకు?
క్షమాపణ చెప్పాలని డిమాండ్ 

హన్మకొండ(వరంగల్), న్యూస్‌లైన్: మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు డిమాండ్ చేశారు. పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్ర ం దిగి వచ్చి తెలంగాణ ఇస్తుందని జిత్తులమారి మాటలెందుకు చెప్పావంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హన్మకొండలోని తమ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండా దంపతులిద్దరు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం కేసీఆర్‌కు చలిమంటగా మారిందని, అమాయక తెలంగాణ యువకులను రెచ్చగొట్టి ఇప్పటికే 800 మంది ప్రాణాలు బలి తీసుకున్నాడని ధ్వజమెత్తారు. 

ఉద్యమం పేరిట ఆరునెలలు డబ్బులు దండుకోవడం.. మరో ఆరునెలలు ఫాంహౌస్‌లో ఉండడం.. కేసీఆర్ కుంభకర్ణుడి పాలసీ అంటూ ఎద్దేవాచేశారు. ప్రజలంతా ఉద్య మం చేస్తుంటే ఆయన అల్లుడు, కొడుకు, కూతురు మాత్రం ఆం ధ్రా నేతలు, కాంట్రాక్టర్లు, వ్యాపారులతో కుమ్మక్కై రూ.కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. మీరు నడిపే న్యూస్ చానల్‌లో సీమాంధ్రుల వాటా ఉన్నది నిజం కాదా..? అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి తెలంగాణ పేరు చెప్పి పూట గడుపుకోవడం, సీట్లు పెంచుకోవడం తప్ప టీఆర్ ఎస్‌కు వేరే పని లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ అధినేత ఏనాడూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, సకల జనుల సమ్మెను ఢిల్లీలో తాకట్టు పెట్టాడని ఆరోపించారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసే భారీ ఒప్పందంతో మళ్లీ ఢిల్లీలో మకాం పెట్టాడని దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజలు త్యాగాలు చేయాలి.. ఉద్యమాలు చేయాలి.. కానీ, కేసీఆర్.. ఆయన కుటుంబం ఆ అమరుల త్యాగాలను తాకట్టు పెట్టి రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. పార్టీని, ఉద్యమాన్ని తాకట్టు పెట్టడం తప్పితే తెలంగాణ సాధించడం చేత కాని కేసీఆర్.. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన స్వప్రయోజనాల కోసం ఉద్యమ స్ఫూర్తిని తాకట్టు పెడుతున్న ఆయన్ను వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.

వైఎస్ పేరిట డైరీ ఆవిష్కరణ పెద్దజోక్ 

కేవీపీ రామచంద్రరావు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరిట డైరీని ఆవిష్కరించడం ఒక పెద్ద జోక్ అని కొండా దంపతులు వ్యాఖ్యానించారు. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత ఆయన కుటుంబం ఎన్నో కష్టాలు పడుతున్నా ఏనాడూ ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి ఈ రోజు డైరీ విడుదల చేయడమేంటో నాకైతే అర్థం కావడంలేదన్నారు. ఈ డైరీ ఆవిష్కరణతో వైఎస్‌ను పొగడటం మాట అటుంచి, ఆయనను తిట్టించినట్లయిందని ఆమె ఆవేదన చెందారు. తాము రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ కుటుంబంతోనే ఉండాలని నిర్ణయించుకున్నామని కొండా దంపతులు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!