నేత సమస్యలపై జగన్ ధర్మవరంలో దీక్ష చేశారు
అలాగే విజయమ్మ కూడా ముందుకొచ్చారు
మూడేళ్లలో కేటీఆర్ ఆ ప్రాంతానికి ఏం చేశారు?
హైదరాబాద్, న్యూస్లైన్:

ఆగ స్టులో తెలంగాణ వస్తుంటే లేఖ ఎందుకు?
తెలంగాణపై వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టమైన వైఖరిని వెల్లడించిందని మహేందర్రెడ్డి చెప్పారు. తెలంగాణను ఇచ్చే శక్తి, అడ్డుకునే ఆలోచన వైఎస్సార్ కాంగ్రెస్కు లేదని పార్టీ ప్లీనరీలోనే ప్రకటించామన్నారు. అంతేకాదు ఇడుపులపాయ సాక్షిగా తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించినట్లు గుర్తుచేశారు. తెలంగాణ ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసిన అభ్యర్థులపై కూడా తమ పార్టీ పోటీ పెట్టలేదన్నారు. రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అర్హత కేంద్రానికే ఉంటుందని తెలిపారు. అయితే కేటీఆర్... సిరిసిల్ల పర్యటనకు ముందే వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పట్ల స్పష్టమైన వైఖరి చెప్పాలనడం అర్థరహితమన్నారు. ఆగస్టులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఒకవైపు కేసీఆర్ చెబుతుంటే మరోవైపు కేటీఆర్ లేఖ ఇవ్వాలని అడగటమేంటని ప్రశ్నించారు. కేసీఆర్పై కేటీఆర్కు నమ్మకంలేదా? అని నిలదీశారు. తెలంగాణ బిడ్డలుగా రాష్ట్ర ఏర్పాటుకోసం తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికైనా జెండాలు పక్కనపెట్టి ఎజెండాతో ముందుకొస్తే తాము కూడా కలిసి వస్తామన్నారు.
No comments:
Post a Comment