YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 13 June 2012

ప్రమాద మృతులకు వైఎస్సార్ సీపీ సంతాపం

విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘటనలో మృతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ జనక్‌ప్రసాద్ తీవ్రసంతాపం ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని అన్నారు. సరైన భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.


వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని ఎస్ఎంఎస్ రెండో విభాగంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆక్సిజన్ సిలిండర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 16 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. మృతులు సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో అతిపెద్ద ప్రమాదంగా దీన్ని చెబుతున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!