YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 10 November 2012

ఉల్లి రైతులకు అండగా ఉంటాం: షర్మిల

ప్రస్తుత ప్రభుత్వం ఉల్లికి గిట్టబాటు ధర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పత్తికొండ శివారులోని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆదివారం పత్తికొండలో పాదయాత్ర చేస్తున్న షర్మిలను కలిసి ఉల్లి రైతులు తమ గోడును వెల్లడించారు. ఇదే పద్దతి కొనసాగితే తమకు ఆత్మహత్యే శరణ్యమని షర్మిలకు విన్నవించారు.ఉల్లి రైతులకు అండగా ఉంటామని షర్మిల భరోసా ఇచ్చారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించిన సంగతిని ఈ సంద ర్భంగా ఉల్లి రైతులు గుర్తు చేసుకున్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!