
కాంగ్రెస్ పార్టీలోనే కాదు, దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనటువంటి గొప్ప పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. రైతులు, పేదలు, బడుగువర్గాలు, మైనార్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తద్వారా రాష్టాభివృద్ధికి ఉపయోగపడేటటువంటి అద్వితీయమైన పథకాలు ఆయన ప్రవేశపెట్టారు. ఆయన అమలు చేసిన పథకాలు సామాన్యమైనవి కావు. రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్క్షం, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ఆయన సాహసంతో మొదలుపెట్టి నిరాటంకంగా కొనసాగించారు. ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధులకు పెన్షన్ పథకం ద్వారా లక్షల మందికి లబ్ది చేకూర్చారు. ఆయన హయాంలో లబ్దిపొందని కుటుంబంలేదంటే అతిశయోక్తికాదు.
35 సంవత్సరాలకు పైగా సుదీర్ఘకాలం ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అనేక పదవులు అలంకరించారు. రెండుసార్లు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దీన స్థితిలో ఉన్న సమయంలో 16 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకువచ్చారు. సంచలన పథకాల ద్వారా ప్రజాధరణ పొంది రెండవసారి కూడా కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన దుర్మరణం చెందారు. అంతటి ఘనచరిత్ర గల ఆ మహానేత ఫొటో పార్టీ కార్యాలయంలో లేకపోవడంతో నేతలకు, కార్యకర్తలకు ఆగ్రహం రావడం సహజం.
No comments:
Post a Comment