
సంక్షేమ పథకాలకు తూట్లు : దివంగత నేత వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడవడం ద్వారా ప్రభుత్వం ప్రజల మనసుల్లో నుంచి ఆయనను తుడిచివేసేందుకు కుయుక్తులు పన్నుతోందని సురేఖ విమర్శించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదనీ కేవలం వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ఇబ్బందులకు గురిచేసే పనిలో తలమునకలై ఉన్నాయనీ వ్యాఖ్యానించారు. జగన్ నిర్దోషిగా త్వరలో బయటకొస్తారన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాలనూ వైఎస్ఆర్ సీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment