

పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎస్ఏ రెహమాన్ మాట్లాడుతూ మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని, అందుకే రాష్ట్రంలోని 99 శాతం మైనార్టీలు వైఎస్ జగన్కు అండగా ఉన్నారని తెలిపారు.కాగా, రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకొని శుక్రవారం రాత్రి భక్తరామదాసు కళాక్షేత్రంలో పువ్వాడ అజయ్కుమార్ ముస్లిం సోదరులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ సెంట్రల్ గవర్నింగ్ బాడీ సభ్యులు డి.రవీంద్రనాయక్, చందాలింగయ్యదొర కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యులు బాణోత్ మదన్లాల్, వి.లక్ష్మీనారాయణ రెడ్డి, రాష్ట్ర ఎస్సీవిభాగం క న్వీనర్ నల్లా సూర్యప్రకాశ్రావు, కార్మిక విభాగం కన్వీనర్ జనక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment