YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Tuesday, April 08, 2025

Thursday, 26 July 2012

రైతు సమస్యలపై వైఎస్ఆర్ సీపీ పోరు

రైతుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు గురువారం అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలను అరికట్టాలని, కొరత లేకుండా ఎరువుల పంపిణి చేయాలని పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ముట్టడిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గుర్నాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు విశ్వేశ్వర్‌రెడ్డి, కవిత, అనంత జిల్లా కన్వీనర్‌ శంకర్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!