
ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని అధికార ప్రతిపక్షాలు కుట్రచేసి జైలుకు పంపడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. ట్రేడ్ యూనియన్ను బలోపేతం చేసేందుకు ఐదు లక్షల మంది అసంఘటిత, రెండున్నర లక్షల మంది సంఘటిత కార్మికులకు సభ్యత్వం అందచేయాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన పాలకమండలి సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, ఎం.వి.మైసూరారెడ్డి, పార్టీ సీనియర్ నేత ఎస్.రామకృష్ణారెడ్డిలు ‘ట్రేడ్ యూనియన్ లోగో’ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్రావు, బీసీ సెల్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment