YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 24 September 2012

నూతన ఒరవడికి వైఎస్ఆర్


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన సంప్రదాయానికి తెరతీసింది. శాసనసభ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆ పార్టీ ప్రజలకు జవాబుదారీగా నిలిచింది. వాస్తవానికి శాసనసభ వర్షాకాల సమావేశాలలో ప్రజాసమస్యలు చర్చించడానికి అధికార పక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి సహకరించలేదు. అయినా బాధ్యతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అందరూ ప్రజాసమస్యలు చర్చించలేకపోయినందుకు క్షమించమని ప్రజలను కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో 13 రోజులు ఏ కార్యకలాపాలు జరుగకుండా వృథా అయ్యాయి. రాష్ట్ర శాసనసభ అయిదు రోజుల సమావేశాలు కూడా అదే తంతుతో ముగిశాయి. సమావేశాలకు పెట్టిన ఖర్చు నిరుపయోగం అయిందని, సమస్యలు చర్చించలేకపోయామని అక్కడ గానీ, ఇక్కడ గానీ ఏ ఒక్క పార్టీ కూడా ఈ విధంగా క్షమాపణలు చెప్పలేదు. అనేక రకాల సమస్యలతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితులలో వారి సమస్యలు సభలో చర్చించలేకపోయినందకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన చెందారు. ఈ నేపధ్యంలో వారు ప్రజలకు క్షమాపణలు చెప్పి నూతన ఒరవడికి శ్రీకార చుట్టారు. 

శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశం రోజునే అధికార పక్షం, ప్రతిపక్షం కుమ్మక్కు అయ్యాయని తేలిపోయింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ సమావేశానికి హాజరుకాలేదు. శాసనసభ సమావేశాలు, అందులో చర్చించవలసిన అంశాల పట్ల వారికి ఎంత గౌరవం ఉందో అర్ధం చేసుకోవచ్చు. సమావేశాల తొలి రోజున వారు ఆడుతున్న డ్రామా స్పష్టమైపోయింది. ప్రణాళిక ప్రకారమే ఆ రెండు పార్టీలు కలిసి సభలో సమస్యలపై చర్చ జరుగకుండా అడ్డుకున్నారు. అధికార పక్షానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పూర్తిగా కొమ్ముకాసిందని అందరికీ అర్థమైపోయింది. మిగిలిన విపక్షాలన్నీ ఈ రెండు పార్టీలపై దుమ్మెత్తిపోశారు. ఐదు రోజుల సమావేశాలు వాయిదాలతోనే ముగిశాయి. మొత్తం ఐదు రోజులలో 4 గంటల 10 నిమిషాలు మాత్రమే సభ సజావుగా జరిగింది. ప్రభుత్వం మూడు బిల్లులు మాత్రమే ప్రవేశపెట్టింది. సమావేశాల మొత్తంలో కాంగ్రెస్ పార్టీ గంటా ఆరు నిమిషాలు, టీడీపీ 39 నిమిషాలు, టీఆర్ఎస్ 52 నిమిషాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 నిమిషాలు, ఎంఐఎం ఆరు నిమిషాలు, సీపీఐ 14 నిమిషాలు, బీజేపీ 20 నిమిషాలు, సీపీఎం 12 నిమిషాలు, లోక్ సత్తా 6 నిమిషాలు, స్వతంత్ర సభ్యులు 17 నిమిషాలు మాత్రమే ఉపయోగించుకున్నారు. అతి దారుణంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడు నిమిషాలు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు 5 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఈటెల రాజేంద్ర 11 నిమిషాలు, వైఎస్ విజయమ్మ 3 నిమిషాలు, గుండామల్లేష్ 4 నిమిషాలు, బీజేపీ నేత లక్ష్మీనారాయణ 6 నిమిషాలు మాట్లాడారు. 

గంటా 13 నిమిషాల సమయం వృధా అయింది. టీఆర్ఎస్ 30 నిమిషాలు, టిడీపీ 14 నిమిషాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 7 నిమిషాలు, బీజేపీ 8 నిమిషాలు, సీపీఐ 4 నిమిషాలు, సీపీఎం, ఎంఐఎం ఒక్కో నిమిషం వృథా చేశాయి. 

సమావేశాల నిర్వహణ తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి కుట్ర పన్ని సభ సక్రమంగా జరుగనివ్వలేదని విమర్శించారు. దానికి తోడు శాసనసభాపతి కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, సుచరిత విమర్శించారు. సమావేశాలలో ప్రజా సమస్యలను చర్చించలేకపోయినప్పటికీ వైఎస్ఆర్ సిపి ప్రజలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతే కాకుండా శాసనసభలో చర్చకు రాని ప్రజాసమస్యలపై పెద్దఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు.


No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!