వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు ఎందుకు వెళ్లారో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియదా అని రాజంపేట ఎమ్మెల్యే అమర్నాధరెడ్డి ప్రశ్నించారు. ఓదార్పుయాత్ర కొనసాగితే కాంగ్రెస్, టీడీపీలకు ప్రజాదరణ కరువు అవుతుందనే కుమ్మక్కై జైలుకు పంపారని ఆయన బుధవారమిక్కడ అన్నారు. జగన్ ను జైల్లో పెట్టి కిరణ్, చంద్రబాబులు యాత్రలు కొనసాగించటం కుట్రలో భాగం కాదా అని అమర్నాధరెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో విశ్వసనీయత ఉన్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకేనని ఆయన అన్నారు. కేజ్రీవాల్ బయటపట్టిన సీడీపై విచారణ చేయించాలని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. |
Wednesday 31 October 2012
జగన్ ను జైల్లో పెట్టి కిరణ్, చంద్రబాబులు యాత్రలు కొనసాగించటం కుట్రలో భాగం కాదా?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment