YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 3 November 2012

హంద్రీనివాను పరిశీలించిన షర్మిల

ఉరవకొండ సమీపంలో హంద్రీనివా కాలువను షర్మిల శనివారం పరిశీలించారు. హంద్రీనివా కాలువ పనులు అయిదు శాతం పూర్తయితే ఫలితాలు రైతులు అందుతాయన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. కాగా ఎర్రన్నాయుడు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని షర్మిల అన్నారు. 

108 సకాలంలో రాకపోవడం వల్లనే ఆయన మృతి చెందారన్నారు. 108 సమయానికి వచ్చిఉంటే ఎర్రన్నాయుడు బతికి ఉండేవారని తెలిపారు. ఎర్రన్నాయుడులాగా ఎంతో మందిని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటోందని షర్మిల విమర్శించారు. వైఎస్ఆర్‌ ఉన్నప్పుడు 108 ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టిందని షర్మిల గుర్తు చేశారు.

source:http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=480398&Categoryid=14&subcatid=0

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!