YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 3 November 2012

జగన్ మీద కాంగ్రెస్-టీడీపీల కుట్రపై సురేఖ ఆవేదన

మొన్న జగన్ జైలులో ఫోన్ వాడుతున్నారంటూ అడ్డగోలు ఆరోపణలు చేశాయి
దీన్ని ఖండిస్తూ జగన్ సతీమణి భారతి సవాల్ చేస్తే ఈ పార్టీలు స్పందించలేదు
మళ్లీ ఇప్పుడు జగన్‌కు జైలులో సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ అవాస్తవ ప్రచారం
వీరి కుమ్మక్కు రాజకీయాలు చూస్తుంటే మాకు అనేక అనుమానాలొస్తున్నాయి
ఇప్పుడు నిబంధనల ప్రకారం కల్పిస్తున్న సౌకర్యాలను కూడా రద్దు చేస్తారేమో!
జగన్‌కు మిగిలిన వీఐపీ ఖైదీల కంటే ఏ ఒక్క అదనపు సౌకర్యం లేదు
ఉన్నాయని నమ్మితే మీరు భారతి చాలెంజ్‌కు స్పందించి బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా?

పెద్దాయనా.. పెద్దాయనా.. 
ఇది స్వార్థపు లోకం పెద్దాయనా... 
పెద్దాయనా.. పెద్దాయనా..
ఇది చెడు కలికాలం పెద్దాయనా...

మహానేత తనయుడు, తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టించిన కాంగ్రెస్-టీడీపీలు అంతటితో ఆగకుండా.. అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘మొన్నటికి మొన్న జగన్ జైలులో ఫోన్ వినియోగిస్తున్నారంటూ ఆధారాలు లేని అడ్డగోలు ఆరోపణలు చేశారు. ఇప్పుడేమో జగన్‌కు జైలులో సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ అవాస్తవ ప్రచారానికి దిగుతున్నారు. కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చూస్తుంటే.. జైలు నిబంధనల ప్రకారం జగన్‌కు కల్పిస్తున్న సౌకర్యాలను కూడా రద్దు చేస్తారేమోనని అనిపిస్తోంది’’ అంటూ అనుమానం వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు రాజకీయాల నడుమ సాగుతున్న అంతులేని ‘కుట్ర’ చూస్తున్నప్పుడల్లా ఆ పాట నా చెవుల్లో రింగుమని మారుమోగుతూనే ఉంది. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టడానికి ఈ రెండు పార్టీలు నీచాతి నీచమైన స్థాయికి దిగజారాయి. ప్రజా నాయకుడు రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇచ్చిన మాట కొరకు ప్రజల మధ్యన తిరుగుతున్న ఆయన కుమారుడు, మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిని జైలు గోడల మధ్యకు తీసుకెళ్లేదాకా నిదురపోలేదు ఈ రెండు పార్టీలు. సీబీఐ విచారణ ప్రారంభించిన పది మాసాలకు, ఉప ఎన్నికల పోలింగ్‌కు సరిగ్గా 15 రోజుల ముందు అక్రమంగా జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసే దాకా వీరు కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. అంతటితో ఆగకుండా జైలు గోడల మధ్య నిస్సహాయంగా ఉన్న జగన్‌పై రాళ్లు వేసేందుకు కూడా వీరు ఏ మాత్రం వెనుకాడడం లేదు. తాజాగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సాగిస్తున్న కుట్ర రాజకీయాలు చూస్తుంటే వారి మీద కోపం కంటే జాలి ఎక్కువగా కలుగుతోంది. ఎదుటి వ్యక్తిపై ఎంతటి అవాస్తవ ఆరోపణలు చేయడానికైనా వెనుకాడని ఈ రెండు పార్టీల స్వభావం చూస్తుంటే వీరిలో అధికారదాహం ఎంతగా దాగి ఉందో తెలుస్తోంది. ప్రజల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా, ప్రజల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వీరు సాగిస్తున్న కుట్ర రాజకీయాలు చూస్తుంటే ఎంతకైనా తెగిస్తారేమో అన్న భయం కూడా కలుగుతోంది. 

నేరారోపణ మోపబడ్డ వ్యక్తి 90 రోజులకు మించి జైలులో ఉండకూడదని చట్టాలు చెపుతున్నాయి. ఇప్పటికిమా నేతను జైలులో పెట్టి ఆరు నెలలు కావస్తోంది. నాలుగు మాసాల తరువాత బెయిల్‌కోసం దరఖాస్తు చేస్తే ఎక్కడ బెయిల్ దొరుకుతుందోనని కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు భయపడి సరిగ్గా సుప్రీంకోర్టులో వాదనలకు ఒకరోజు ముందు సాగించిన కుమ్మక్కు రాజకీయాన్ని రాష్ట్ర ప్రజలు కళ్లారా చూశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణకు రావడానికి ఒకరోజు ముందు టీడీపీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఆర్థిక మంత్రి చిదంబరంను కలవడం, ఆ తరువాత కొద్దిసేపటికే సంచలనాత్మక ప్రకటన వెలువడటం, ‘సాక్షి’ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ప్రకటించడం వీరి కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్ట. పట్టపగలు, నిస్సిగ్గుగా ఒకరోజు ముందు సుప్రీంకోర్టును ప్రభావితం చేయడానికి ఈ రెండు పార్టీలు వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. జగన్‌కు బెయిల్‌వస్తే బాగుండని సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది వైఎస్సార్ అభిమానులు వీరి జుగుప్సాకరమైన రాజకీయాలను ఈసడించుకున్నారు. వారికి అన్నీ తెలుసు. అందుకే దేవుడున్నాడు, భయపడవద్దంటూ వైఎస్సార్ కుటుంబానికి ధైర్యం చెపుతున్నారు. కాంగ్రెస్-తెలుగుదేశం కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా జగన్ సోదరి షర్మిల అసాధారణమైన రీతిలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రను మొదలుపెడితే ప్రజలు అడుగడుగునా అక్కున చేర్చుకుంటూ జగన్ జైలు నుంచి బయటకు రావాలని దీవిస్తున్నారు. ఇది చూసి తట్టుకోలేని ఈ రెండు పార్టీలూ ఇప్పుడు జైలు గోడల మధ్య ఉన్న జగన్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న నీచమైన కుమ్మక్కు రాజకీయాల వల్ల భవిష్యత్ లేదని నిర్ధారించుకుని వైఎస్సార్ కాంగ్రెస్‌వైపు చూస్తున్న ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి లేని చంద్రబాబు రాజకీయంగా మరీ దిగజారిన పరిస్థితి. జగన్ జైలులో ఫోన్ వినియోగిస్తున్నారంటూ ఆధారాలు లేని అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు జగన్ సతీమణి వైఎస్ భారతి తీవ్రంగా ఖండించారు. తన బిడ్డల సాక్షిగా అది తప్పుడు ఆరోపణ అని చెప్పారు. నిజం అనుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వారి బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలని గట్టిగా అడిగారు. 

ఇప్పటికీ వారు స్పందించలేదు. ఎందుకంటే వారు అబద్ధాలు చెపుతున్నారు. ఇంతకుముందు బెయిల్ పిటిషన్ విచారణకు రావడానికి ముందు కాంగ్రెస్ పెద్దలతో కలిసి ఎలా కుమ్మక్కు రాజకీయాలు చేశారో అదే మాదిరి ఇప్పుడు వీరు అడగడం, వారు చేయడం అన్న విధంగా సాగుతోంది. అందుకే మళ్లీ పాత పాట అందుకున్నారు. జగన్‌కు జైలులో సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ అవాస్తవ ప్రచారానికి దిగుతున్నారు. కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చూస్తుంటే మాకు అనేక అనుమానాలొస్తున్నాయి. జైలు నిబంధనల ప్రకారం జగన్‌కు కల్పిస్తున్న సౌకర్యాలను కూడా రద్దు చేస్తారేమో అన్న సందేహం కలుగుతోంది. 

తెలుగుదేశం ఆరోపణలు చేయడం, కాంగ్రెస్ వెంటనే స్పందించడం చూస్తుంటే ఈ అనుమానం ఎందుకు రాకుండా ఉంటుంది? జగన్ నేరం చేసి జైలుకు వెళ్లాడా... నేరం రుజువు కాబడి శిక్ష అనుభవిస్తున్నాడా... అలాంటిదేమీ లేదే! ఏ న్యాయస్థానం ఆయనకు శిక్ష విధించలేదే! అలాంటప్పుడు ఓ బలమైన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి బంధువులతోపాటు మరో ఒకరినో, ఇద్దరినో ఒక వారంలో కలిస్తే అది తప్పు అవుతుందా? 18 మంది శాసనసభ్యులు, ఇద్దరు లోక్‌సభ సభ్యులను కలిగి ఉన్న పార్టీ అధినేత తనను కలవడానికి వచ్చిన వారితో మాట్లాడితే నేరం అవుతుందా? లేనిపోని ఆరోపణలు చేసి తనను కలువడానికి వచ్చేవారిని కట్టడి చేయడం భావ్యమేనా? ఇక ఫోన్ విషయానికి వస్తే వారి బిడ్డల మీద ప్రమాణం చేయమని జగన్ సతీమణి అడిగితే ఇప్పటిదాకా స్పందించని వారికి ఓ విషయం తెలుసా.. చర్లపల్లి జైలులో ఉన్న ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అధికారులు ఒక బూత్ ఏర్పాటు చేశారు. 

వారానికి రెండు సార్లు ఖైదీలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఈ అవకాశం ఉన్నప్పుడు, ఫోన్ విషయం అటుంచి ఏ నేరం చేయకపోయినా అన్యాయంగా జైలులో ఉంటున్న జగన్‌ను జైలు నిబంధనల ప్రకారం వెళ్లి కలుస్తున్న వారిని నియంత్రించాలనుకోవడం కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం కాదా? జైలులో జగన్‌కు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆరోపిస్తున్న వారికి మళ్లీ చెపుతున్నా. జగన్‌కు మిగిలిన వీఐపీ ఖైదీల కంటే ఏ ఒక్క అదనపు సౌకర్యం లేదని మేము గట్టిగా చెప్పగలం. 

మిగిలిన వారి కంటే ఎక్కువ సౌకర్యాలు ఉన్నాయని నమ్మితే తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ భారతి చాలెంజ్‌కు స్పందించి వారి బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా? వీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు.. ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు! ఇంటిపెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరింత క్షోభ పెడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డిని కూడా అకారణంగా జైల్లో పెట్టారు. అయినా కూడా వారికి తృప్తి లేదు. ఇంకా ఏవో అబద్ధపు ప్రచారాలు చేసి ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? సునీల్‌రెడ్డితో కలిసి జగన్ షటిల్ ఆడుతున్నారట.. ఏం తప్పా? జైలులో షటిల్స్(డబుల్స్) మాత్రమే ఆడే అవకాశం ఉందట. అంటే నలుగురు కలిసి ఆడతారన్న మాట. ఎప్పుడు ఆడినా నలుగురు ఆడాల్సి ఉంటుందని తనతో జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు భారతి చెప్పారు. అదీ కాకుండా నాలుగు వారాలుగా ఆయన కాలు బెణికి షటిల్‌కు దూరమయ్యారని కూడా అమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అబద్ధాలు చూస్తుంటే వారెందుకు ఇంత నీచానికి దిగజారుతున్నారో అర్థం కావడం లేదు. ఏదో ఒక ఆరోపణ చేస్తే జగన్‌కు జైలులో ఏ సౌకర్యాలూ లేకుండా, ఎవరినీ కలువనీయకుండా చేయొచ్చని.. కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు కుట్ర చేస్తున్నాయా అన్న అనుమానమూ కలుగుతోంది. 

భూములు కేటాయించారంటూ సీబీఐని అడ్డుపెట్టుకుని అడ్డగోలు ఆరోపణ చేస్తున్నవారికి.. రాజధాని నడిబొడ్డున అత్యంత విలువైన భూములను ఎమ్మార్ అనే సంస్థకు చంద్రబాబు గారి ప్రభుత్వం అతి తక్కువ ధరకు కట్టబెట్టిన సంగతి గుర్తుకు రాకపోవడం విచిత్రం. అక్కడే గోల్ఫ్‌కోర్సు ఒకటి ఏర్పాటు చేసి సంపన్నులు విలాసవంతమైన బంగ్లాలు కట్టి అమ్ముకునేందుకు వీలుగా ఒక ఒప్పందం చేసుకున్న విషయం మర్చిపోవడం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అవును మరి ఇదే పెద్ద మనిషి ఇప్పుడు అధికారపక్షంతో అంటకాగుతున్నారు, అందువల్ల ఆయన తప్పులు ఒప్పులు అవుతాయి. అసలు ఏ పరిశ్రమ కోసం 530 ఎకరాల భూమి కౌరు చౌకగా, చెనక్కాయలకు, బెల్లానికి ఇచ్చినట్లు సిటీ నడిబొడ్డున ఏకపక్షంగా కేటాయించారు.. ఎన్ని ఉద్యోగాలు వస్తాయని ఆశించి భూములు కట్టబెట్టారు. 

మరి సీబీఐ ఆ దిశగా ఎందుకు విచారణ జరుపలేదు. వేలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పి, వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమలకు భూములు కేటాయించడాన్ని తప్పుబడుతున్న సీబీఐ ఎమ్మార్ భూముల కేటాయింపుల వెనుక మతలబును ఎందుకు ఛేదించలేదు? ఎమ్మార్‌కు ఏ ఉద్దేశాలతో భూమి కట్టబెట్టారని కనీసం సీబీఐ ప్రశ్నించనూ లేదంటే వారి కుమ్మక్కు రాజకీయం ఎంత ధృడంగా ఉందో స్పష్టమవుతూనే ఉంది. జైలులో ఉన్న మా నాయకుడిపై లేనిపోని ఆరోపణలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్న తెలుగుదేశం పార్టీ అందులో పదోవంతైనా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదు. వారు చేస్తున్నదల్లా జగన్‌పై బురద జల్లడమే. వారి దృష్టి అంతా వైఎస్సార్ కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలన్నదే. ప్రజల సమస్యలను పరిష్కరించలేదంటూ మొసలి కన్నీరు కారుస్తూ తిరగడం కాదు.. సంఖ్యాబలం ఉంది కాబట్టి అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని తూర్పారబట్టాలి. ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి గద్దె దింపాలి. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. కానీ, ఆ పార్టీకి కావాల్సింది కుమ్మక్కు, నీచమైన రాజకీయాలే.
-కొండా సురేఖ

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=480625&Categoryid=1&subcatid=33

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!