YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 29 October 2012

'ఎవరోచేసిన పాపాలను వైఎస్ పై వేశారు'

భువనగిరి: ఎవరో చేసిన పాపాలను దివంగత మహానేత వైఎస్ఆర్ పైన వేశారని ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఇక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశం మొత్తం మీద ఎన్నికలలో నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీతో 
భువనగిరి నియోజకవర్గ ఓటర్లు రావి నారాయణ రెడ్డిని గెలిచింపిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా కడపలో భారీ మెజార్టీతో గెలిచారన్నారు. రాబోయే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!