YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 1 November 2012

4న వైఎస్ఆర్ సీపీలోకి ఎమ్మెల్యే వనిత

గోపాలపురం : పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వనిత ఈనెల 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కొవ్వూరులో జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు.

ఎమ్మెల్యే వనితతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు, చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కర్రా రాజారావు, దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కొటారు రామచంద్రరావు పార్టీలో చేరనున్నారు. కాగా కొవ్వూరులో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆళ్లనాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తదితరులు పరిశీలిస్తున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!