YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 18 August 2012

విద్యుత్ కోతలపై రోడ్డెక్కిన రైతన్న

విద్యుత్ కోతలకు నిరసనగా పలు జిల్లాల్లో రైతన్నలు రోడ్డెక్కారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్ల్ సబ్ స్టేషన్ ను శనివారం రైతులు ముట్టడించారు. నల్గొండ జిల్లా మోత్కూర్ మండలం దత్తప్పగూడెం సబ్ స్టేషన్ ను రైతులు ముట్టడించి ఆందోళకు దిగారు. వరంగల్ జిల్లా ఎల్లంపేట సబ్ స్టేషన్ కు రైతులు తాళం వేసి తమ నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను రైతులు ముట్టడించారు. 

కాగా ప్రకాశం జిల్లా పెదారవీడులో విద్యుత్ కోలతకు నిరసనగా రైతులు ధర్నా చేపట్టారు. శ్రీశైలం-మార్కాపురం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపటంతో ఆమార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతారామపురంలో రైతులు ధర్నాకు దిగారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!