YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 16 August 2012

సీఎం కిరణాలతో 26 గ్రామాల్లో చీకట్లు

ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండల పరిధిలో 26 గిరిజన గ్రామాల్లో చీకట్లు అలుముకున్నాయి. ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ దిగేందుకు కరెంట్ తీగలు అడ్డు వస్తున్నాయనే కారణంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నిన్న ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అప్పటినుంచి ఈ గ్రామాలన్నీ అంధకారంలోనే మగ్గుతున్నాయి. విద్యుత్ పునరుద్దరణపై స్థానిక ఏఈని అడిగితే తాను ఏమీ చేయలేనని పై అధికారుల ఆదేశాల మేరకే సరఫరా నిలిపివేశామని చెబుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో ఈ విషయాన్ని వారు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు దృష్టికి తీసుకువెళ్లారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!