YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 14 August 2012

జగన్ రిమాండ్ 28 వరకు పొడిగింపు

 వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 28 వరకూ పొడిగించింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో ఈ మేరకు ఆదేశించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ బీపీ ఆచార్య, నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు ఈనెల 28 వరకు పొడిగించింది. 

రిమాండ్ ముగియడంతో మంగళవారం వీరందరినీ చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. అలాగే జగన్ సంస్థల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ సమర్పించిన మూడు చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డి, జగతి, జనని తరఫున కంపెనీ సెక్రటరీ సీపీఎన్ కార్తీక్‌తోపాటు హెటిరో, అరబిందో, రాంకీ సంస్థల ప్రతినిధులు కోర్టు ఎదుట హాజరయ్యారు. మూడు చార్జిషీట్లకు సంబంధించిన విచారణ 28కి వాయిదా పడింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!