YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 17 August 2012

నిలోఫర్‌లో మరణమృదంగం

హైదరాబాద్, తిరుపతి, వరంగల్, న్యూస్‌లైన్: దేశంలోనే రెండో అతిపెద్ద రెఫరల్ సెంటర్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రి నిలోఫర్‌లో మరణమృదంగం మోగుతోంది. రోజుకు సగటున 7 నుంచి 10 మంది చిన్నారులు మృత్యువాత పడుతుండగా వైద్యులు, నర్సులు, ఇతర సేవల కొరత వల్ల తాజాగా ఈ సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం ఒక్క రోజే 16 మంది శిశువులు మృతి చెందారు. కేవలం 500 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రి అవుట్‌పేషంట్ విభాగానికి ప్రతిరోజూ 1,200 నుంచి 1,500 మంది వస్తుండగా, ఆస్పత్రిలో నిత్యం 1,000 నుంచి 1,200 మంది నవజాత శిశువులు ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతుంటారు. 


రుయాలో మరో నలుగురు చిన్నారుల మృతి

తిరుపతి రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో శుక్రవారం వివిధ కారణాలతో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం వివిధ రకాల జబ్బులతో 69 మంది చిన్నారులను ఆస్పత్రిలో చేర్చుకున్నట్లు సూపరింటెండెంట్ వీరాస్వామి చెప్పారు. ఇందులో పీడియాట్రిక్ ఇంటెన్సివ్‌కేర్ యూనిట్‌లో 29 మందిని చేర్చుకోగా 9 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నియో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో 40 మంది చిన్నారులను చేర్చుకున్నామని 16 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 

ఎంజీఎంలో ముగ్గురు చిన్నారుల మృతి

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం ఒకేరోజు ముగ్గురు పిల్లలు మృతి చెందారు. వేర్వేరు కారణాలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందుతూ ప్రాణాలొదిరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!