శాసనసభను షెడ్యూలు ప్రకారం వెంటనే సమావేశపరచాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభను ప్రభుత్వం పరిహాస సభగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 9 కోట్ల తెలుగు ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. అవిశ్వాసం పెడతారన్న భయంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పారిపోయారని విమర్శించారు. అందుకు చంద్రబాబు సహకరిస్తున్నారన్నారు. సిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన కాంగ్రెస్ నేతల మానసిక వైకల్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం ప్రజాద్రోహానికి పాల్పడుతుందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment