YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 8 December 2012

బాబు ఏం సమాధానం చెబుతారు?: అంబటి

కాంగ్రెస్ పార్టీకి నిమిషం కూడా పరిపాలించే హక్కు లేదంటున్న చంద్రబాబు తమ పార్టీ ఎంపిలు రాజ్యసభలో గైర్హాజరుపై ఏం సమాధానం చెబుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. చీకట్లో ఎందుకు లాలూచీ పడతారు, టీడీపీని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేయమని సలహా ఇచ్చారు. చిరంజీవికి వచ్చినట్లు కేంద్రమంత్రి పదవి వస్తుందన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ వ్యతిరేకి అనుకుని టీడీపీ శ్రేణులు భ్రమపడవద్దని జాగ్రత్తలు చెప్పారు.


కాంగ్రెస్,టిడిపి కుమ్మక్కు రాజకీయం రాజ్యసభ ఘటనతో తేలిపోయిందని వైఎస్‌ఆర్ సీపీ దక్షిణ తెలంగాణ ఇన్‌ఛార్జ్ జిట్టా బాలకృష్ణరెడ్డి చెప్పారు. మిర్యాలగూడలో ఈరోజు జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో నల్గొండ జిల్లాలో షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!