YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 5 December 2012

తప్పుడు వార్తలు రాసిన కొన్ని పత్రికలు,టీవీ చానళ్లపై జాతీయ ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు


 మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో షర్మిల పాదయాత్రపై పాలమూరు వర్సిటీ విద్యార్థులు టమాటాలు, గుడ్లు, రాళ్లు విసిరితే భయపడి ఆమె బస్సెక్కారని తప్పుడు వార్తలు రాసిన కొన్ని పత్రికలు(సాక్షి కాదు), టీవీ చానళ్లపై జాతీయ ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పాదయాత్రపై విద్యార్థులు దాడి చేసినప్పటికీ షర్మిల వారివైపు చేయి చూపుతూ అభివాదం చేసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్లారని తెలిపారు. విద్యార్థులు వ్యూహం ప్రకారం దాడికి దిగినా ఎలాంటి ప్రతి దాడులనూ ప్రోత్సహించకుండా ఆమె ప్రశాంతంగా యాత్ర కొనసాగించారని చెప్పారు. జిల్లాలో విజయవంతంగా సాగుతున్న యాత్రపై ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికే ఇలాంటి అసత్య వార్తలు రాశారని విమర్శించారు.

ఇప్పటి దాకా జిల్లాలోని ఆలంపూర్, గద్వాల, మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన యాత్రకు అనూహ్య స్పందన లభించిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పలుచోట్ల రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలతో ఆమె మమేకమయ్యారని గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ అనుబంధ విభాగాల కన్వీనర్ శంభు పుల్లయ్య శెట్టి, ఆర్.రవిప్రకాశ్, సయ్యద్ సిరాజుద్దీన్, పార్టీ నేత లింగారెడ్డి పాల్గొన్నారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!