తెలుగుదేశం పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్న రాజ్యసభ సభ్యుల గైర్ హాజరు వ్యవహారంపై జాతీయ స్థాయి నాయకులు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు సైతం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టిడిపి ఎమ్.పి హరికృష్ణను కొందరు ఇతర రాష్ట్రాల ఎమ్.పిలు కలసి మీ వాళ్లకు ఎన్ని డబ్బులు ముట్టాయని ప్రశ్నించారని టిడిపి నేతలు చెబుతున్నారు. అలాగే సిపిఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి అసలు పార్టీ చంద్రబాబు చేతిలో ఉందా అని వ్యాఖ్యానించినట్లు టిడిపి సీనియర్ నేత ఒకరు అన్నారు. జాతీయ మీడియాలో సైతం టిడిపిపై వ్యతిరేక కధనాలు అదికంగా వచ్చాయని టిడిపి నేతలు భాదపడుతన్నారు.
source:kommineni
source:kommineni





No comments:
Post a Comment