YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 8 December 2012

కేసుల నుంచి తప్పించుకునేందుకే..........

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకే ఎఫ్ డిఐలపై ఓటింగ్ జరిగిన రోజున ఆ పార్టీ సభ్యులు రాజ్యసభకు గైర్హాజరయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు విమర్శించారు. తన మీద కేసులు లేకుండా చేస్తే, ప్రభుత్వాన్ని కాపాడతానని చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారని, ఇదే 
నిజమైన క్విడ్ ప్రోకో అని ఆయన అన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారని 
చెప్పారు. సుజనా చౌదరి చంద్రబాబు ఆత్మ అని, ఆయన (ఆత్మ) నాయకుడుకు తెలియకుండా లోక్ సభకు గైర్హాజరవుతారా? అని ఆయన ప్రశ్నించారు. తనని కాంగ్రెస్ వారు మేనేజ్ చేయలేరని దేవేంద్ర గౌడ్ చెబుతున్నారని, అంటే వాళ్ల నేత చెబితేనే గైర్హాజరయినట్లు అర్ధమవుతోందన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!