డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసే నిజాయితీ, నిబద్దత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్లో ఉన్నాయని నమ్మే తాము వేలాది మంది కార్యకర్తలతో కలిసి ఆ పార్టీలో చేరామని జీహెచ్ఎంసీ డిప్యూటీ ప్లోర్ లీడర్ దేప సురేఖభాస్కర్ రెడ్డి, ఆమె భర్త దేప భాస్కర్రెడ్డి అన్నారు. మూడువేల మంది కార్యకర్తలతో కలిసి వైఎస్ విజయమ్మ సమక్షంలో వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు ఆర్కేపురం నుంచి లోటస్పాండ్ దాకా కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment