YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 14 September 2012

జగన్ బెయిల్ పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ కాపీని ఇంకా పరిశీలించాల్సి ఉందన్న కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా దేశాయ్ తో కూడిన ధర్మాసనం ఎదుట ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది.

జగన్ మోహన్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు గోపాల్ సుబ్రహ్మణ్యం, అల్తాఫ్ వాదనలు వినిపించారు. రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ అభూతకల్పనలతో సీబీఐ ఆరోపణలు చేసిందని... తీరా ఛార్జ్ షీటుకు వచ్చేసరికి అంకెలన్నీ జారిపోతున్నాయన్నారు. జగన్ అరెస్టై ఇప్పటికే వంద రోజులకు పైగా జైల్లో ఉన్నారని న్యాయవాదులు పేర్కొన్నారు.

ఆయన అరెస్ట్ కు ముందు మూడు ఛార్జిషీట్లు దాఖలు చేశారని, అరెస్ట్ చేశాక సప్లిమెంటరీ వేస్తామని సీబీఐ చెప్పినా... ఇప్పటివరకూ సప్లిమెంటరీ వేయలేదని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. సప్లిమెంటరీ వేయటానికి సీబీఐ ఇంకా ఎన్నిరోజులు సమయం తీసుకుంటుందని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతోనే జగన్ పై కుట్ర పన్నారని వారు వాదించారు.

కాగా సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ మోహన్ జైన్ హాజరయ్యారు. దాదాపు అరగంట సేపు కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టుకు హాజరు కావల్సిన సమయంలో నోటీసులు జారీ చేయాల్సిన అసవరం ఏమొచ్చిందని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. క్విడ్ ప్రో కో కేసులో మే 27, 2012న వైఎస్ జగన్ ను సీబీఐ అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు ఆడిటర్ విజయ సాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ పై విచారణను సెప్టెంబర్ 28న చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!