YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 18 November 2012

'రాష్ట్రం మొత్తం వైఎస్ జగన్ వెంటే'

రాష్ట్రం మొత్తం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి వెంట ఉందని పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి ఆయన ఆదివారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మతో భేటీ అయ్యారు. 

చిత్తూరు జిల్లాలో పర్యటించాలని వారు ఈ సందర్భంగా విజయమ్మను ఆహ్వానించారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు వారిద్దరూ ప్రకటించారు. తంబళ్లపల్లి, పలమనేరులో బహిరంగ సభలు నిర్వహిస్తామని అమర్‌నాథ్‌ రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!