YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 14 December 2012

ప్రధానికి వైఎస్ విజయమ్మ లేఖ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. దేశ ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని పెంచిన ఎరువుల ధరలను తక్షణం తగ్గించాలని ఆమె తన లేఖలో కోరారు. గడిచిన రెండేళ్లలో వరి కనీస మద్దతు ధర 25 శాతం పెరిగితే ...ఎరువుల ధరలు మాత్రం దాదాపు 300 శాతం వరకూ పెరిగాయని విజయమ్మ తెలిపారు.

వ్యవసాయాభివృద్ధికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో చర్యలు తీసుకున్నారని, వైఎస్ హయాంలో అభివృద్ధి రేటు 6.87 శాతంగా నమోదైందని విజయమ్మ లేఖలో వివరించారు. ప్రస్తుతం రైతులకు వ్యవసాయం భారంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలను తగ్గించాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!