ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాము అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, జీహెచ్ ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేష్ ప్రకటించారు. వీరు ఇరువురు శుక్రవారం చంచల్ గూడ జైల్లో వైఎస్ జగన్ ను కలిశారు. అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో ఆ తేదీ ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ మహానేత వైఎస్ఆర్ పాలనను మరచిపోలేకపోతున్నారని అన్నారు. |
Friday 14 December 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment