YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 14 December 2012

జగన్‌కు ప్రజల అండదండలు

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి తాము అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌, జీహెచ్ఎంసీ కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కాలేరు వెంకటేష్‌ ప్రకటించారు. వీరు ఇరువురు శుక్రవారం చంచల్గూడ జైల్లో వైఎస్ జగన్ను కలిశారు.

అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఒకటి రెండు రోజుల్లో ఆ తేదీ ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ మహానేత వైఎస్‌ఆర్‌ పాలనను మరచిపోలేకపోతున్నారని అన్నారు.

వైఎస్.జగన్‌కు ప్రజల అండదండలున్నాయని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాలేరు వెంకటేశ్వర్లు అన్నారు. చంచల్‌గూడ జైలులో వైఎస్ జగన్‌ను కాలేరు వెంకటేశ్వర్లు కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ భ్రష్టుపట్టిందని కాలేరు అన్నారు. వైఎస్‌ఆర్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చుతోందని కాలేరు విమర్శించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!