YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 11 December 2012

'ప్రభుత్వనిర్వాకంతో పాడిపరిశ్రమ నిర్వీర్యం'

ప్రభుత్వ నిర్వాకం వల్ల పాడి పరిశ్రమ నిర్వీర్యమైందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ రెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వారు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి ఎప్పుడు హాలిడే 
ప్రకటిస్తారా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా పాలసేకరణ ధర పెంచి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. చిత్తూరు డెయిరీని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సర్వనాశనం చేశారని విమర్శించారు. తన హెరిటైజ్ కోసం చిత్తూరు డెయిరీ మూయించేంతవరకు బాబుకు నిద్రపట్టలేదన్నారు. రైతు సమస్యలపై శాసనసభలో చర్చిద్దామనుకుంటే ప్రభుత్వం పారిపోయిందన్నారు. పాడి రైతును ఆదుకోకుంటే వైఎస్ఆర్ సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!