YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 6 August 2012

ఇఫ్తార్ విందులో పాల్గొన్న విజయమ్మ

రాజమండ్రి : రాజమండ్రి పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సోమవారం సాయంత్రం ముస్లిం మహిళల ఏర్పాటు చేసిన ఇప్తార్‌ విందులో పాల్గొన్నారు. రంజాన్‌ సందర్భంగా అందరికీ శుభం కలగాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ముస్లింలతో మహానేత వైఎస్‌ఆర్‌కు ఉన్న అనుబంధాన్ని విజయమ్మ గుర్తు చేశారు. అందర్ని అప్యాయంగా పలకరిస్తూ వాళ్లతో విందు ఆరగించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు తరలివచ్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!