YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 6 August 2012

సమస్యలపై నోరువిప్పని టిడిపి: భూమన

తిరుపతి: టీడీపీతో కలిసి కాంగ్రెస్ దొంగాట ఆడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. తిరుపతిలో ఎన్నో సమస్యలు ఉన్నా టీడీపీ నోరు విప్పడం లేదన్నారు. కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ప్రధాన సమస్యలపై రోజూ పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. వైఎస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయితే తిరుపతి, తిరుమలకు నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గాలేరు-నగరి జలాలను తిరుపతికి రప్పిస్తామని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!