YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 5 August 2012

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేస్తే ఉద్యమం


పేద విద్యా ర్థుల కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీ యింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ హెచ్చరించారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రీయింబర్స్‌మెంట్‌ను సంక్షేమ పథకంగా మాత్రమేగాక పెట్టుబడిగానే వైఎస్ భావించారన్నారు. విద్యార్థులపై పెట్టుబడి పెట్టి, వారిని విద్యావంతులనుచేస్తే రాష్ట్రం బాగుపడుతుందనేదే ఆయన సత్సంకల్పమన్నారు. రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు తీరుకు నిరసనగా ఈనెల 12, 13 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చేసే ఉద్యమానికి విద్యార్థిలోకం తరలిరావాలన్నారు

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!